పశ్చిమ బెంగాల్ లో 'నైరోబీ ఫ్లై' అనే కొత్త వ్యాధి వ్యాపిస్తోంది. ఆఫ్రికాకు చెందిన నైరోబీ ఫ్లై (యాసిడ్ ఫ్లై) అనే ఈగల వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇవి మనుషుల్ని కుట్టవు. మన మీద వాలినప్పుడు వాటిని మనం కొడితే రసాయనం లాంటి పదార్థాన్ని విడుదల చేస్తాయి. దీంతో చర్మంపై దద్దుర్లు వస్తాయి.శిలిగుడి, డార్జిలింగ్ సహా ఉత్తర బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో, సిక్కిం రాష్ట్రంలో కూడా చాలా మంది ఈ వ్యాధి బారిన పడ్డారు.