ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న విద్యాకానుక ఈ రోజే మొదలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 05, 2022, 11:23 AM

రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది  జగనన్న విద్యాకానుక (జేవీకే) స్టూడెంట్‌ కిట్లను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. వేసవి సెలవుల అనంతరం 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూళ్లు ప్రారంభమయ్యే తొలిరోజైన మంగళవారం జూలై 5న సీఎం వైయ‌స్‌ జగన్‌ చేతుల మీదుగా విద్యార్థులకు ఈ కిట్లు అందించనున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వీటి పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్థులకు ఇవి అందనున్నాయి. ఇందుకోసం రూ.931.02 కోట్లను ప్రభుత్వం వ్యయంచేస్తోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com