భారత్తో జరుగుతున్న 5వ టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు 132 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ జట్టులో బెయిర్ స్టో 106 పరుగులు చేశాడు. బిల్లింగ్స్ 36, రూట్ 31, స్టోక్స్ 25 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 3, షమీ 2, సిరాజ్ 4, శార్దూల్ 1 వికెట్ తీశారు. టీంఇండియా తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.