న్యూఢిల్లీ: వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞాపనకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. రకరకాల పెండింగ్ కేసులను విచారించేందుకు సుమారు 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్రం గతంలో సుప్రీంను కోరింది. అయితే కేంద్రం చేసిన ప్రతిపాదనకు అత్యున్నత న్యాయస్థానం ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.