న్యూఢిల్లీ : సరిగ్గా 16 ఏళ్ల కిందట పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. పార్లమెంటు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 2001 డిసెంబర్ 13న లష్కరేతొయిబా ఉగ్రసంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు పాల్రలమెంటుపై దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. నాటి దాడిలో ఒక సామాన్యపౌరుడు సహా 14 మంది అసువులు బాసారు.