అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి 34వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 34వ రోజు పాదయాత్రను అనంతపురం రూరల్ పాపంపేట బైపాస్ నుంచి ప్రారంభించారు. పాదయాత్ర రుద్రంపేట, సవేరా హాస్పటల్ క్రాస్, కక్కలపల్లి క్రాస్, డాల్ఫిన్హోటల్, ప్రసన్నాయపల్లి, చిన్మయానగర్, రాప్తాడు మీదుగా గంగలకుంట వరకు కొనసాగనుంది. రాప్తాడులో వైఎస్ జగన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.