పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక ప్యాకేజ్ ఏపీ హక్కు అని మంత్రి నారా లో కేశ్ అన్నారు. తమ కుటుంబ ఆస్తులను ప్రకటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీకి కేంద్ర ప్రభుత్వం అసలేమీ చేయట్లేదని అనడం కరెక్ట్ కాదని అన్నారు. కేంద్రానికి-రాష్ట్రానికి, టీడీపీ-బీజేపీకు మధ్య ఎటువంటి గ్యాప్ లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అభివృద్ధికి టీడీపీ, చంద్రబాబు ఎంతో కృషి చేశారని అన్నారు. ‘మెట్రో’, హైటెక్ సిటీ, హెచ్ఐసీసీ ప్రాంగణం వంటివి రూపొందించింది చంద్రబాబేనని, రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు అభివృద్ధి చేయడం బాధ్యతలో భాగమని అన్నారు.