వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర 26వ రోజుకు చేరుకుంది. కడప, కర్నూలు జిల్లాలో ముగిసిన పాదయాత్ర ఈరోజు అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనున్నారు. గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి మండలం బసేనపళ్లి నుంచి ఉదయం జగన్ పాదయాత్ర ప్రారంభమవుతోంది. బసేనపళ్లి నుంచి మధ్యహ్నం బోజన సమయానికి గుత్తికి చేరుకుంటారు. బోజనమనంతరం గుత్తిలోనే పాదయాత్ర సాగించి .. సాయంత్రం 5 గంటలకు గుత్తి గాంధీ చౌక్ లో బహిరంగ సభలో పాల్గొని.. గుత్తిలోనే బస చేస్తారు.