శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. బట్టీ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు తీపి కబురు అందించింది. ఆగస్టు నెలకు సంబంధించిన అన్ని టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అన్ని టిక్కెట్లు కూడా ఆన్లైన్లో విడుదల చేయబడతాయి. ఆగస్టు నెల ఆర్జిత సేవా టిక్కెట్లను రేపు ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా ప్రకటించింది.అలాగే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజుల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ టిక్కెట్లను కూడా రేపు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. లక్కీ డిప్ ద్వారా సుప్రభాతం, తోమాల, అర్చన, ఆర్జిత సేవా టిక్కెట్లు పొందేందుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు టీటీడీ అవకాశం కల్పించింది.