ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే ప్రాజెక్టులకు ప్రత్యేక కార్పొరేషన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2017, 01:34 AM

రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు


 రైల్వే బోర్డుకు సమానస్థారుులో అధికారాలు


 రూ. 100 కోట్ల వ్యయంతో మూలధన నిధి


 అమరావతి అనుసంధాన లైన్లకు ప్రాధాన్యం


అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : నవ్యాంధ్రలో రైల్వే ప్రాజెక్టులకు మంచి రోజులు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టులకు ఊపునిచ్చేం దుకు ఒప్పందం కుదుర్చుకున్న రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నాయి. కొత్త రైల్వేలైన్లు, అదనంగా లైన్ల నిర్మా ణం, స్టేషన్లు అభివృద్ధి వంటి అంశాల్లో రైల్వేబోర్డుకు సమానస్థాయిలో దీనికి అధికారాలుంటాయి. ఏపీ రైల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అమ రావతి పేరుతో విజయవాడలో ఏర్పాటుచేయాలని నిర్ణయించాయి. రూ.100 కోట్ల మూలధన నిధిని సమకూర్చనున్నాయి. ఎండీ సహా గరిష్టంగా 12 మంది డెరెక్టర్లు ఉంటారు. రైల్వేబోర్డు, ఏపీ ప్రభుత్వం నియమించాల్సి ఉంటుంది.


ఎస్పీవీ ఏర్పాటు ద్వారా


కార్పొరేషన్‌ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యాక స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్పీవీ) ఏర్పాటుచేస్తారు. ఏయే ప్రాజెక్టుల్ని భాగస్వామ్యంలో (జాయింట్‌ వెంచర్‌) చేప ట్టాలన్నదాన్ని ఇది నిర్ణయిస్తుంది. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ఆమోదం తెలిపిన నంబూరు-అమరావతి-ఎర్రుపాలెం డబుల్‌లైన్‌, పెదకూరపాడు- అమరా వతి, సత్తెనపల్లి-నర్సారావుపేట సింగిల్‌లైన్లను ఈ విధానంలో చేపట్టడం దాదాపు ఖాయమని రైల్వేశాఖ పేర్కొంటోంది. గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్‌ వంటి మరికొన్ని లైన్లను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు.


నూతన విధానంలో ఏర్పాటు


భాగస్వామ్య విధానంలో ఉచితంగా భూమి ఇవ్వడంతోపాటు ప్రాజెక్టు వ్యయం లో 51 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన 49 శాతం రైల్వే శాఖ ఇస్తుంది. మెజార్టీవాటాతో ప్రాజెక్టుల ఎంపికలో నిర్ణయాధికారం రాష్ట్రాని కే ఉండనుంది. కార్పొరేషన్‌కు ఎండీని రైల్వేశాఖతో సంప్రదింపులు జరిపి రాష్టమ్రే నియమిస్తుంది.  కార్పొరేషన్‌ సమావేశాలకు ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. కొత్తగా నిర్మించే రైల్వేలైన్లు, ఇతర ప్రాజెక్టు ల్లో వచ్చే ఆదాయం, లాభాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉంటుంది.


వనరులు, ప్రాజెక్టుల అమలు ఇలా


కొత్త విధానంలో చేపట్టే ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించు కుంటారు. దీంతో నిర్ణీత సమయంలో ఆయా పనులు పూర్తయ్యే అవకాశముం టుంది. భారీగా వ్యయమయ్యే ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల కోసం బ్యాంకులు, ఆర్థికసంస్థల నుంచి రుణం తీసుకుంటారు. దీర్ఘకాలంలో అయినా పెట్టుబడితో పాటు లాభాలు వచ్చే ప్రాజెక్టులకే ఎంపికలో ప్రాధాన్యం ఇస్తారు. సంయుక్త భాగస్వామ్య కంపెనీ (జాయింట్‌ వెంచర్‌)లో ఎంపికచేసే ప్రాజెక్టుల ను బట్టి రాష్ట్ర ప్రభుత్వం గరిష్ఠంగా ఏటా 3 నుంచి 5 వేల కోట్ల వరకు భరించా ల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com