కాకినాడ: కాపులను బీసీల్లో చేర్చడంపై తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో బీసీ వర్గాలు పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి. ఈ సందర్బంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడమేగాక టైర్లను రోడ్లపై వేసి కాల్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. కాగా... కాపులను బీసీ ఎఫ్ గా పరిగణిస్తూ 5శాతం రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో బీసీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట, తిరుపతి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర బీసీ వర్గాలు రోడ్లపైకి వచ్చి ఆందోళనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.