అమరావతి: కాపులకు న్యాయం చేసిన ఏకైక నాయకుడిగా సీఎం చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని ఎమ్మెల్మే బోండా ఉమ అన్నారు. ఇవాళ అసెంబ్లీలో కాపుల రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాపులను ఏనాడు పట్టించుకోలేదన్నారు. కాపుల కోసం పది రూపాయలు కూడా కాంగ్రెస్ వెచ్చించలేదని తెలిపారు. కాపు రిజర్వేషన్లతో బీసీల్లో ఉన్న 143 కులాలకు ఎలాంటి నష్టం ఉండదని ఎమ్మెల్యే తెలిపారు. బీసీల్లో ఉన్న పేదలను అభివృద్ధిలోకి తీసుకొస్తేనే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని, బీసీ కమిషన్ ఏర్పాటుచేసి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభిప్రాయాలు సేకరించామన్నారు. కాపు రిజర్వేషన్ల బిల్లు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అంశమని ఆయన పేర్కొన్నారు.