గిరిజన గ్రామాలలో చేస్తున్న కొండవాలు టెర్రా సింగ్ పనుల వలన గిరిజనులకు పోడు వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందని వర్షాలు పడినట్లయితే నీరు నిల్వ ఉండి అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని మెలియాపుట్టి ఏపీవో రవి అన్నారు. ఆయన పలు గిరిజన గ్రామాల్లో పర్యటించి పనులను పరిశీలించారు. కొండవాలు ప్రాంతాల్లో అధిక శాతం పనులు చేసే విధంగా గిరిజనులు చూడాలని సిబ్బందికి ఆదేశించారు.