భారత్ ఐటీ దిగ్గజం టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) మరో ఘనత సాధించింది. ప్రపంచ ఐటీ రంగంలో అతి విలువైన తొలి మూడు బ్రాండులలో ఒకటిగా నిలిచింది. అయిదేళ్ల కిందట తొలి నాలుగు బ్రాండుల్లో ఒకటిగా నిలిచిన సంస్థ తాజాగా మరో స్థానం ఎగబాకడం విశేషం. అంతర్జాతీయ బ్రాండు సేవల సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ఈ విషయాలను వెల్లడిచింది. టీసీఎస్ నాణ్యమైన పనితీరుతో ఐబీఎం, ఎసెంచర్ వంటి సంస్థల సరసన నిలిచిందని బ్రాండ్ ఫైనాన్స్ ముఖ్యకార్య నిర్వహణాధికారి (సీఈఓ) డేవిడ్ హేగ్ వెల్లడించారు.