అమరావతి: పురపాలక పాఠశాలలను రెండేళ్లలో దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ అన్నారు. సభలో పురపాలక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంపై చర్చ జరిగింది. మౌలిక వసతులు కల్పించి ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలన్న సభ్యుల ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. తెలుగు భాషను ఎక్కడా విస్మరించడం లేదన్నారు. ఆప్షనల్స్ సబ్జెక్టులను మాత్రమే ఆంగ్లంలో బోధిస్తున్నామన్నారు.