చిత్తూరు: చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు అటవీప్రాంతంలో అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ సమయంలో 150వ మెట్టు వద్ద అటవీ అధికారులకు 42 మంది తమిళ కూలీలు తారసపడ్డారు. వారిని పట్టుకునేందుకు యత్నించిన అధికారులపై కూలీలు ఎదురుదాడికి దిగారు. దీంతో అటవీశాఖ అధికారులు గాల్లోకి కాల్పులు జరపడంతో ఎర్రచందనం కూలీలు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన స్థలం నుంచి కోటి రూపాయల విలువైన 38 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకుని పరారైన తమిళ కూలీల కోసం గాలిస్తున్నారు.