కోల్కతా: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్లో విజయంపై కన్నేసింది టీమిండియా. ఈ మ్యాచ్లో 6 వికెట్లు తీస్తే కోహ్లి సేన అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుంది. 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. ప్రస్తుతం 4 వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది. భువనేశ్వర్ 2, ఉమేష్, షమి చెరొక వికెట్ తీశారు. ఓపెనర్లు సమరవిక్రమ డకౌట్ కాగా.. కరుణరత్నె 1 పరుగు చేసి ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 172 పరుగులు చేసి.. మ్యాచ్లో మూడు రోజులు వెనుకబడి ఇప్పుడీ స్థితిలో నిలవడం నిజంగా అద్భుతమే. అంతకుముందు కెప్టెన్ కోహ్లి సెంచరీ చేయడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ను 8 వికెట్లకు 352 పరుగుల దగ్గర డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.