పుణే: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కోపార్డి గ్యాంగ్ రేప్ కేసులో అహ్మద్నగర్ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ముగ్గురు నిందితులను దోషులుగా ఖరారు చేసింది. వీరికి శిక్షలను నవంబర్ 22న ఖరారు చేయనున్నట్లు కోర్టు తెలిపింది. నిందితులు ముగ్గురు జితేంద్ర షిండే, సంతోష్ జి.భవల్, నితిన్ జి.భాయ్లుమేలు బాలికపై కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని న్యాయమూర్తి సువర్ణ కోవలె పేర్కొన్నారు . కేసు దర్యాప్తులో లభించిన ఆధారాలు.. వారు నేరానికి పాల్పడినట్లు నిరూపించాయని జడ్జి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.