గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 182 స్థానాలకుగాను 70మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ఇవాళ విడుదల చేసింది. ప్రస్తుత గుజరాత్ సీఎం విజయ్రూపానీ రాజ్కోట్ వెస్ట్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. డిప్యూటీ సీఎం నితిన్భాయ్ పటేల్ మెహ్సనా స్థానం నుంచి బరిలో నిలువనున్నారు. డిసెంబర్ లో గుజరాత్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.