వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తేనే ఎక్కువ దిగుబడులు సాధించగలుగుతామని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆధునిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విశాఖలో జరుగుతున్న అగ్రిటెక్ సదస్సుకు ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు ప్రయోజనం కలిగించేలా అగ్రిటెక్ సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. వినూత్నమైన సాంకేతికతతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.