ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యవసాయానికి టెక్నాలజీ జోడించాలి: బాలకృష్ణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 17, 2017, 12:12 PM

వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తేనే ఎక్కువ దిగుబడులు సాధించగలుగుతామని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆధునిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విశాఖలో జరుగుతున్న అగ్రిటెక్‌ సదస్సుకు ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు ప్రయోజనం కలిగించేలా అగ్రిటెక్‌ సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. వినూత్నమైన సాంకేతికతతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com