పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుతెన్నులు శాసనసభ, మండలి సభ్యులకు తెలియాల్సిన అవసరం ఉందని ఏపీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. పోలవరం టూర్కు విపక్ష సభ్యులను కూడా ఆహ్వానించామని చెప్పారు. మొత్తం 200మంది ప్రజాప్రతినిధులు పట్టిసీమ, పోలవరం సందర్శనకు వస్తున్నారన్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి దేవినేని చెప్పారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం నాలుగు బస్సుల్లో అమరావతి నుంచి బయలుదేరారు.