కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనతికాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షిస్తోందని కొరియన్ కాన్సులేట్ జనరల్ హుంగ్ తాయ్కిమ్ అన్నారు. ఏపీ ఎకనమిక్ డెవల్పమెంట్ బోర్డు ఆధ్వర్యంలో కొరియన్ కాన్సులేట్ బృందం మంత్రి భూమా అఖిలప్రియను బుధవారం సచివాలయంలో కలిసింది. ఈ సందర్భంగా హుంగ్ తాయ్ కిమ్ మాట్లాడుతూ కొరియన్ టూరిజం సంస్థ శాఖను త్వరలోనే గుంటూరులో ప్రారంభిస్తామన్నారు.