గుంటూరులో ఘోర ప్రమాదం తప్పింది. నందివెలుగు రోడ్డులోని మణి హోటల్ వద్ద ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇటీవల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఈ భవనం ముందు భాగాన్ని అధికారులు తొలగించారు. దీంతో కూలీలు శనివారం మరమ్మతు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదాన్ని ముందే గుర్తించిన కూలీలు బయటికి రావడంతో ప్రమాదం తప్పింది.