విజయవాడ: నగరంలోని కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలో ఇద్దరు విద్యార్ధులు అదృశ్యమయ్యారు. 9వ తరగతి చదువుతున్న రాంప్రసాద్, లలిత్కుమార్ అనే విద్యార్ధులు శుక్రవారం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు అక్కడా ఇక్కడా తెలిసిన వారి ఇళ్లల్లో వెతికారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో శనివారం కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు విద్యార్ధుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.