బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్-శ్రీలంక మధ్య రెండు రోజుల సన్నాహక మ్యాచ్ కొనసాగుతోంది. కోల్కతాలోని జాదవ్పూర్ యూనివర్సిటీ క్యాంపస్లో ఈ మ్యాచ్ జరుగుతోంది. సంజు శాంసన్ సారథ్యంలోని ఎలెవన్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.దీంతో బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక జట్టు దూకుడుగా ఆడుతోంది. 14 ఓవర్లు ముగిసే సమయానికి లంక జట్టు వికెట్ ఏమీ నష్టపోకుండా 93 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కరుణరత్నే(54), సమరవిక్రమ(30) ఉన్నారు. టీమిండియాతో తొలి టెస్టుకు ముందు ఈ మ్యాచ్ను పూర్తిగా వినియోగించుకోవాలని లంక భావిస్తోంది. ఇరు జట్ల మధ్య ఈ నెల 16న తొలి టెస్టు ఈడెన్గార్డెన్స్లో జరగనుంది.బోర్డు జట్టులో హైదరాబాద్ రంజీ ఆటగాళ్లు తన్మయ్ అగర్వాల్, రవికిరణ్, బవనక సందీప్, ఆకాశ్ భండారీ చోటు దక్కించుకోవడం విశేషం.