ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టోల్ వసూళ్లు.. ఇక కొత్త పద్ధతిలో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 09, 2017, 09:57 AM

జాతీయ రహదారులపై టోల్ వసూలుకు కొత్త పద్ధతిని అవలంభించనున్నట్టుగా ప్రకటించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. టోల్ గేట్ల వద్ద టోల్ కట్టడానికి వాహనాలను చాలా సేపు నిలబెట్టుకోవాల్సిన అవసరం లేకుండా నూతన విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఫాస్టాగ్ పద్ధతితో వాహనాలను నిలిపే అవసరం లేకుండా టోల్ ను వసూలు చేయనున్నట్టుగా ఆయన ప్రకటించారు.


ప్రస్తుతం టోల్ కట్టడానికి టోల్ గేట్ వద్ద వాహనాన్ని నిలుపుకోవాలి. ఒక్కో వాహనదారుడి నుంచి డబ్బు తీసుకుని టోల్ వసూలు చేయడానికి చాలా సమయం పడుతుంది. దీంతో వెనుక ఉన్న వాహనదారులు ఆగక తప్పదు. వారాంతాల్లో, ప్రయాణాలు ఎక్కువగా ఉన్న సమయాల్లో టోల్ గేట్ల వద్దే వాహనాలు బారులుగా ఆగిపోతూ ఉంటాయి. దీనిపై విమర్శలు వస్తున్నాయి, వాహనదారుల నుంచి అసహనం వ్యక్తం అవుతోంది.


ఇలాంట నేపథ్యంలో ఫాస్టాగ్ పద్ధతిని అమల్లోకి తీసుకురానున్నారట. దీని ప్రకారం... టోల్ ప్లాజాలా వద్ద వాహనాల నంబర్లను డిటెక్ట్ చేసే కెమెరాలను ఏర్పాటు చేస్తారు. రాడ్ కెమెరా డిటెక్టర్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కసారి వాహనం ఆ కెమెరా పరిధిని దాటిందంటే.. టోల్ ప్లాజాను క్రాస్ అయినట్టుగా రికార్డ్ అవుతుంది. సదరు కారు యజమాని అకౌంట్ నుంచి టోల్ ఫీజు కట్ అవుతుంది. ప్రస్తుతానికి 378 టోల్ ప్లాజాల్లో ఈ పద్ధతిని అవలంభిస్తున్నామని త్వరలోనే దేశంలోని అన్ని టోల్ ప్లాజాల వద్దా ఇదే పద్ధతిని అమల్లోకి తీసుకురానున్నట్టుగ గడ్కరీ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com