ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇవాళ చెన్నైలో పర్యటించనున్న ప్రధాని మోదీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 06, 2017, 10:22 AM

చెన్నై: ఇవాళ ప్రధాని మోదీ చెన్నైలో పర్యటించనున్నారు. తమిళ్ డెయిలీ దిన తంతి 75వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. ఈ వేడుకల్లో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొననున్నారు. ఈ వేడుకలకు తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, సీఎం పళని స్వామి హాజరుకానున్నారు. మద్రాస్ యూనివర్సిటీలోని సెంటినరీ ఆడిటోరియంలో ఈ వేడుకలు జరగనున్నాయి.  ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలు దేరి ఉదయం 10.30కు మద్రాస్ యూనివర్సిటీకి చేరుకుంటారు. ఇక.. ప్రధాని పర్యటన నేపథ్యంలో చెన్నై నగరంలో 10 వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల అనంతరం.. పీఎంవో ఆపీసులో పని చేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ సోమనాథన్ కూతురు పెళ్లికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com