ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బూటాన్‌ బుల్లి రాకుమారుడితో సుష్మ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 01, 2017, 01:26 PM

భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ కుటుంబసమేతంగా భారత పర్యటనకు వచ్చారు. మంగళవారం దిల్లీ చేరుకున్న వాంగ్‌చుక్‌, ఆయన సతీమణి జెస్టున్‌ పెమాకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ సాదరస్వాగతం పలికారు. బుధవారం సుష్మ తన కార్యాలయంలో భూటాన్‌ రాజుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాంగ్‌చుక్‌ వారసుడు, బూటాన్‌ బుల్లి రాకుమారుడితో సుష్మ కాసేపు ముచ్చటించారు.


నాలుగు రోజుల పాటు వాంగ్‌చుక్‌ భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై చర్చించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com