జగ్గయ్యపేట : కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎవరనే విషయంపై ఉత్కంఠ వీడింది. వైకాపా నేత ఇంటూరి రాజగోపాల్ అలియాస్ చిన్నా ఛైర్మన్గా ఎన్నికయ్యారు. తెదేపా సభ్యుల బహిష్కరణతో ఛైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమైంది. సమావేశంలో కోరం ఉండటంతో రాజగోపాల్ను ఛైర్మన్గా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అనంతరం ఆయనతో ప్రమాణం చేయించారు.