తెలుగు ప్రవచనాలు , సాహిత్యం , హిందూ ధర్మం మొదలగు వాటి మీద పట్టు సాధించి , ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ , మానవత్వాన్ని ప్రతి మనిషిలో పెంపెందించేందుకు తన వంతు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి గరికపాటి నరసింహారావు. ఐతే తాజాగా ఆయనకు అవార్డు వరించింది అనే దాని కన్నా మంచి వ్యక్తిత్వాన్ని ప్రభుత్వం గుర్తించింది అని చెప్పొచ్చు . ఈ సందర్భంగా తెలుగు భాషా,సాహిత్యం మరియు విద్యలో చేసిన అపారమైన కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి గౌరవ రాష్ట్రపతి శ్రీ రామ్ నాధ్ కొవింద్ గారి చేతులమీదుగా పద్మశ్రీ తో సత్కరించబడిన సందర్భంగా "సహస్రావధాని" శ్రీ గరికపాటి నరసింహారావు గారికి అభినందనలు అని బీజేపీ నాయకులూ సోము వీర్రాజు తెలియపరిచారు.