పోర్చుగీస్ దేశంలోని అగ్నిపర్వత ద్వీపంలో కేవలం 48 గంటల్లోనే 1,000 సార్లు భూమి కంపించింది. పోర్చుగల్లోని మిడ్-అట్లాంటిక్ అగ్నిపర్వత ద్వీపాల్లో 1,000 సార్లు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. పోర్చుగీస్ దీవుల్లో భూకంప సంక్షోభం ఏర్పడిందని భూగర్భశాఖ నిపుణులు అంచనా వేశారు. శనివారం మధ్యాహ్నం నుంచి సావో జార్జ్ ద్వీపంలో రిక్టర్ స్కేలుపై 1.9 నుంచి 3.3 తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయని అజోర్స్ ద్వీపసమూహం యొక్క సీస్మో-అగ్నిపర్వత నిఘా కేంద్రం అధిపతి రుయి మార్క్వెస్ చెప్పారు. ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి నష్టం జరగలేదు.