రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సాయపడేలా తమిళనాడు ప్రభుత్వం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రమాదాల బారిన పడిన వారికి వైద్య సదుపాయాలతో పాటు.... సకాలంలో ఆసుపత్రిలో చేర్పించిన వారికి 5 వేల నగదు ప్రోత్సాహం, ధ్రువపత్రాన్ని అందించనున్నట్లు CM స్టాలిన్ అసెంబ్లీ వేదికగా తెలిపారు. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న 609 ఆసుపత్రుల్లో 48 గంటల్లో చికిత్స అందించడానికి గతంలో జీరో అవర్ పేరిట ఆ సదుపాయాన్ని కల్పించారు