ప్రభుత్వ అనుమతులు లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న నారాయణ, చైతన్య పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్. ఎఫ్ ఐ, ఎన్ఎస్. యుఐ, అర్. ఎస్. ఎఫ్, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు మండల కేంద్రంలోని స్థానిక నెహ్రూ కూడలిలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మండల కేంద్రంలో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా ఎలాంటి అనుమతులు లేకుండా నారాయణ, చైతన్య కార్పొరేట్ పాఠశాలలు డిస్కౌంట్ల పేర్లతో ముందస్తుగా ఆడిషన్లు నిర్వహిస్తున్నారని,
అదేవిధంగా విచ్చలవిడిగా, కరపత్రాలు పంచుతూ ప్రచారాలు నిర్వహిస్తు ఫ్లెక్సీ లను, బోర్డింగ్ లను సైతం ఏర్పాటు చేస్తున్నారని కావున ఆ పాఠశాల యాజమాన్యం పై విద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం బ్యానర్లను ఫ్లెక్సీలను కరపత్రాలను నిప్పు పెట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నామాల నాగార్జున, శీల విజయ్ కుమార్, పిక్కిలి మహేష్, రావులచెరువు సురేష్ ఇడపబత్తిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.