కాకినాడ నగరంలో ఇంటి పన్ను కట్టకపోతే సామాన్లు తీసుకుపోతాం అని వాహనంపై బ్యానర్ కట్టుకొని ప్రజలకి దర్శనమిచ్చిన వాహనాలు గుర్తున్నాయా...?ఐతే భేదిరింపులకు మాత్రమే ఇలా చేస్తున్నారు అనుకున్నారు ప్రజలు. కానీ గత నాలుగు రోజుల నుంచి, రాష్ట్రం మొత్తం జప్తు వాహనాలు తిప్పుతూ, ఇంటి పన్ను, కుళాయి పన్ను కట్టాలని బెదిరింపులు. నేడు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో, ఇంటి పన్ను కట్టలేదని, పేదల ఇళ్ళకు తాళం పిఠాపురం లోని మోహన్ నగర్ లో రెండు ఇండ్లకు తాళం వేసిన ఘటన ఈ రోజు జరిగింది. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ ప్రభుత్వ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజల ప్రాధమిక హక్కులు హరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.