ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళ లేని సమాజం నిరర్థకం: ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 21, 2022, 02:09 PM

సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య ఉద్యోగం వ్యాపారం రాజకీయాలలో మహిళలు పురుషులతో సమానంగా అభివృద్ధి చెందాలని, అప్పుడే అన్ని విధాలుగా సమాజం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. రాప్తాడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నందు జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వైయస్సార్ క్రాంతి పథం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ డిఆర్డీఎ పిడి నరసింహారెడ్డి హాజరయ్యారు. ముందుగా నియోజకవర్గంలోని 6 మండలాల మహిళా ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్, వై. యస్. ఆర్ క్రాంతి పథం వీఓ లీడర్లు, వీఓఏలతో జ్యోతి ప్రజ్వలన గావించారు.


ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మన కుటుంబంలో అమ్మ శక్తివంచన లేకుండా పిల్లలను పెంచి పోషిస్తుంది. కుటుంబాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తుంది. అలాగే సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళల తోడ్పాటు తోనే సాధ్యం అవుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలనే ముఖ్య ఉద్దేశం తోనే వైసీపీ ప్రభుత్వం రాజకీయంలోను, ఉద్యోగాలలోను ఎక్కువ శాతం మహిళలకు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్ లలో మహిళలు ఎక్కువ మంది ఉన్నారనే విషయాన్ని గమనించాలన్నారు. అలాగే సంక్షేమ పథకాలలో కూడా మహిళలే యజమానులు గా ఉండే విధంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలు లేని సమాజం నిరర్థకం అన్నారు.


స్త్రీ శక్తిని మాటల్లో చెప్పలేము అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళా పక్షపాతి అని తెలిపారు స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని గొప్పగా వివరించారు. గ్రామైక్య సంఘాలను బలోపేతం చేస్తూ ఆ కుటుంబాల్లో వెలుగును నింపుతున్నామని చెప్పారు. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ సంఘాల వీఓ లీడర్లను, వీఓఏలను అభినందిస్తూ, జ్ఞాపికలను అందజేసి పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళలు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలియజేస్తూ సన్మానించారు.


ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పసుపుల హేమావతి, ఎంపీపీలు చిట్రెడ్డి జయలక్ష్మి, కుంపటి భాగ్యమ్మ, శ్రీశైలం ప్రవీణ, హేమావతి, యనమల సుజాత, గుజ్జల వరలక్ష్మి, మహిళా లీడర్ ఉషారాణి, వైస్ ఎంపీపీ మన్నల వరలక్ష్మి అవార్డు గ్రహీతలు మల్లేశ్వరి భవాని షాహినా పార్వతి రభియాభాయి చిన్న నాగమ్మ ఎంపీడీవో సాల్మన్ రాజు కో-ఆర్డినేటర్ రామేశ్వర్ రెడ్డి ఏపీఎంలు శివకుమార్ రెడ్డి, నల్లప్ప రఘునాథ్ రెడ్డి వెంకటప్ప మదనమోహన్ మార్కెట్ ఛైర్మన్ గోపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ బోయ రామాంజనేయులు పసుపుల ఆది, చెన్నారెడ్డి మరూరు నారాయణస్వామి సత్తిరెడ్డి కన్వీనర్ శేఖర్ చిన్న కృష్ణారెడ్డి మహిళలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com