మాతాశిశు మరణాలు తగ్గించేందుకు పౌష్టికాహారం అందిస్తున్నాం. మనం గడిచిన ఈ రెండేళ్లలో రూ.3998 కోట్లు మహిళల పౌష్టికాహారానికి ఖర్చు చేశాం. మహిళల ఆరోగ్యం పట్ల వైయస్ జగన్ అత్యంత శ్రద్ధ తీసుకున్నారు అని మంత్రి తానేటి వనిత తెలపగా , టీడీపీ హయాంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. కార్తీక మాసంలో అయ్యప్పమాల వేస్తే సారా అమ్మకాలు తగ్గుతున్నాయని బాధపడిన వ్యక్తి చంద్రబాబు. టీడీపీ హయాంలోనే కొత్త బ్రాండ్లకు పర్మిషన్ ఇచ్చారు అని దేవదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలియచేసారు.