రాప్తాడు నియోజకవర్గం,కనగానపల్లి మండల కేంద్రంలో,*గౌరవ సభ..ప్రజా సమస్యల చర్చా వేదిక* కార్యక్రమం సందర్బంగా జరిగిన ర్యాలీలో స్థానిక మండల తెదేపా ముఖ్య నాయకులు, మహిళలు,కార్యకర్తలతో కలసి పాల్గొని అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడారు. ఈరోజు కనగానపల్లి ప్రజలు మాపై చూపించిన ప్రేమ ఆప్యాయతలకు ధన్యుడను. మీ ఉత్సాహం మీ కసిని అలాగే పెట్టుకోండి రాబోయే ఎలక్షన్ లో వైసీపీని కూకటివేళ్లతో సహా తీసి పడేద్దాం! కాలం మారింది ట్రెండ్ మారింది అనే విషయాన్ని మీ అందరు గుర్తు పెట్టుకోవాలి. ఈ 2 సంవత్సరాలు ఇదే విధంగా కష్టపడి పనిచేసి వైసీపీ బెండ్ తీయాల్సిన అవసరం కచ్చితంగా ఉంది!! ఈ రెండు సంవత్సరాలు నడిచింది ఒక లెక్క... ఇకపై నడిచేది ఒక లెక్క!! ఏ కార్యకర్తకు సమస్య వచ్చిన వారికి అండగా మేముంటాం!! అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.