ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవీన్​ భౌతికకాయం సీఎం నివాళి

national |  Suryaa Desk  | Published : Mon, Mar 21, 2022, 11:32 AM

రష్యా ఉక్రెయిన్​ యుద్ధంలో మరణించిన భారత విద్యార్థి నవీన్​ శేఖరప్ప గ్యాన్​గౌడర్​ భౌతికకాయం సోమవారం తెల్లవారుజామున కర్ణాటక రాజధాని బెంగళూరుకు చేరుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై.. నవీన్​ భౌతికకాయానికి నివాళులర్పించారు.ఈ నెల 1వ తేదీన.. ఉక్రెయిన్​లోని ఖార్కీవ్​లో రష్యా జరిపిన దాడిలో నవీన్​ ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. అతని పార్థివదేహాన్ని దేశానికి తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు కర్ణాటక సీఎం."రష్యా దాడిలో నవీన్​ ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. అతని భౌతికకాయాన్ని దేశానికి తీసుకొచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు," అని బసవరాజ్​ బొమ్మై తెలిపారు.అంతకుముందు.. రూ. 25లక్షల చెక్​ను నవీన్​ కుటుంబానికి అందజేశారు సీఎం. అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని హామీనిచ్చారు.కాగా.. నవీన్​ భౌతికకాయాన్ని వైద్య పరిశోధనలకు ఇస్తామని అతని కుటుంబసభ్యులు ఇప్పటికే వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com