రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప గ్యాన్గౌడర్ భౌతికకాయం సోమవారం తెల్లవారుజామున కర్ణాటక రాజధాని బెంగళూరుకు చేరుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. నవీన్ భౌతికకాయానికి నివాళులర్పించారు.ఈ నెల 1వ తేదీన.. ఉక్రెయిన్లోని ఖార్కీవ్లో రష్యా జరిపిన దాడిలో నవీన్ ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. అతని పార్థివదేహాన్ని దేశానికి తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు కర్ణాటక సీఎం."రష్యా దాడిలో నవీన్ ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. అతని భౌతికకాయాన్ని దేశానికి తీసుకొచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు," అని బసవరాజ్ బొమ్మై తెలిపారు.అంతకుముందు.. రూ. 25లక్షల చెక్ను నవీన్ కుటుంబానికి అందజేశారు సీఎం. అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని హామీనిచ్చారు.కాగా.. నవీన్ భౌతికకాయాన్ని వైద్య పరిశోధనలకు ఇస్తామని అతని కుటుంబసభ్యులు ఇప్పటికే వెల్లడించారు.