పశ్చిమ గోదావరి జిల్లా: టీ. నరసాపురం, సచివాలయ సిబ్బంది సమయానికి విధులకు హాజరు కావాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి హరిహరనాథ్ ఉద్యోగులకు సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సచివాలయ సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దని చెప్పారు. స్పందన కార్యక్రమం ద్వారా అందిన ఫిర్యాదులు సామరస్యంతో పరిష్కరించాలన్నారు. సమయానికి బయో మెట్రిక్ వెయ్యాలన్నారు.