విద్యుత్ ఘాతంతో మంటలు చెలరేగి లారీ దగ్ధమైన ఘటన ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో నరసరావుపేట మండలం బుక్కాపురం వద్ద చోటుచేసుకుంది. లారీ ఓనర్ శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం తాతపూడి నుండి అడిగోప్పలకు జనరేటర్ల లోడుతో వెళ్తున్న లారీ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నికి ఆహుతి అయినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న నరసరావుపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు పది లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు.