ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ లో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఆస్ట్రేలియా జట్టులో మెగ్ లాన్నింగ్ 97, అలైస్స హేలీ 72, రాచెల్ 43 పరుగులతో రాణించారు. ఈ టోర్నీ లో ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడిన టీమిండియా 2 మ్యాచ్ లను గెలిచి మూడింట్లో ఓడిపోయింది.