కాకినాడ కార్పొరేషన్ తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం ట్విట్టర్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల మంచి కోరి పరిపాలన చేస్తున్నట్లు ఏ కోశానా కనిపించడం లేదని.. పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్లు ట్రాక్టర్లు వేసుకుని తిరగడం ఏం సూచిస్తోంది..? డెయిలీ ఫైనాన్స్ వ్యాపారం చేసుకునేవాళ్ల ఆలోచనలా ఉంది’ అంటూ జనసేన అధినేత పవన్కల్యాణ్ శుక్రవారం ట్వీట్ చేశారు. కాకినాడ కార్పొరేషన్ పన్ను వసూళ్ల తీరుతో పాటు కర్నూలు కార్పొరేషన్ చెత్త పన్ను వసూలుకు వ్యవహరిస్తున్న తీరుపైనా ఆయన స్పందించారు. ట్విటర్లో వారి వైఖరిని నిలదీశారు. ‘ప్రజలు గౌరవప్రదంగా జీవించడం ఈ ప్రభుత్వానికి నచ్చదు. చెత్త పన్ను విధింపే ఒక దరిద్రం అనుకుంటే వసూలు చేస్తున్న విధానం మరింత దిగజారుడుగా ఉంది. కర్నూలులో వ్యాపారులు ఆ పన్ను చెల్లించలేదని దుకాణాల ముందు నగరంలోని చెత్తను తెచ్చి పోసి అవమానిస్తారా? ఇది కచ్చితంగా మానవహక్కుల ఉల్లంఘనే’ అని ఆయన మరో ట్వీట్ చేసి దానికి కర్నూలు చెత్త వివాదంపై ఈనాడు ప్రచురించిన వార్త ప్రతిని జత చేశారు.