గుంటూరు: మంగళగిరి పట్టణంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నృసింహుని సన్నిధిలో శనివారం ఉదయం ఆలయ ముఖ్యమండపంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. హుండీల లెక్కయింపునకు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సామాన్య భక్తునివలె హాజరై స్వామివారి నగదును లెక్కించారు. కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈవో అన్నపరెడ్డి రామకోటిరెడ్డి పర్యవేక్షించారు.