ఒంటిపూట బడులు వెంటనే నిర్వహించాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కరెకృష్ణ, జిల్లా కార్యదర్శి నాగరాజు గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదోని పట్టణంలోని శివ శంకర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో డీటీఎఫ్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రతి రోజూ 37 డిగ్రీల ఉష్టోగ్రత నమోదు అవుతోందన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒంటిపూట బడులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు.