రహదారి ప్రమాదంలో ఎలక్ట్రీషియన్ దుర్మరణం చెందిన ఘటన గుంటూరు జిల్లా ఆమరావతి మండలం నరుకుళ్లపాడు వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. అమరావతి ఎస్సై కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడి గడపకు చెందిన ఎలక్ట్రీషియన్ ఇష్టంశెట్టి రామకృష్ణ (37), లారీ మెకానిక్ అరుమాకుల కుమార్ కలిసి అమరావతిలో ఒక లారీకి మర్మతులు చేసేందుకు విజయవాడ నుంచి సామగ్రి తీసుకుని వాహనంలో ప్రయాణానికి ఉపక్రమించారు.
గుంటూరులో వ్యక్తిగత పనులు ముగించుకుని అమరావతికి బయలుదేరారు. నరుకుళ్లపాడు బ్రిడ్జి వద్ద వాహనం అదుపు తప్పి చెట్టునుఢీకొట్టారు. డ్రైవర్ కుమార్ పక్కన కూర్చున్న రామకృష్ణకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కుమార్ కు తీవ్ర గాయాలు కావడంతో అమరావతి సీహెచ్ సీకి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.