కుటుంబ కలహాల నేపథ్యంలో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు మంగళగిరి పట్టణ పరిధిలోని ఆటోనగర్ లో ఉన్న ధనలక్ష్మి బ్రిక్స్ కంపెనీలో మొలక విష్ణు పనిచేస్తున్నాడు. కాగా గత కొంతకాలంగా కుటుంబంలో వివాదాల నేపథ్యంలో గురువారం రాత్రి వివాదం చోటు చేసుకోగా శుక్రవారం తెల్లవారు జామున విష్ణు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారమివ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.