అమెరికాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం పర్యటిస్తోంది. ఐయోవా స్టేట్ క్యాపిటల్లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పురస్కార ప్రదానోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. సాయంత్రం వివిధ కంపెనీల సీఈవోలతో చంద్రబాబు భేటీ కానున్నారు. అమెరికా పర్యటన ముగించుకుని చంద్రబాబు మూడ్రోజుల పర్యటన కోసం దుబాయ్ వెళ్లనున్నారు.