ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో మూడు నెలల్లో విద్యుత్ రైళ్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 17, 2022, 12:02 PM

మరో మూడు నెలల్లో పాకాల - ధర్మవరం మధ్య విద్యుత్ రైళ్లు నడుస్తాయని గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్ వెంకటరమణా రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన పాకాల-కలికిరి మధ్య జరిగిన విద్యుదీకరణ పనులను పరిశీలించారు. అలాగే విద్యుత్ ట్రైన్ ట్రైల్ రన్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా పీలేరులో డిఆర్ఎం విలేకరులతో మాట్లాడుతూ, విద్యుత్ రైళ్లు నడపటానికి చేపట్టిన విద్యుదీకరణ పనులు ప్రస్తుతం పాకాల-కలికిరి మధ్య పూర్తి కావచ్చాయని అన్నారు. కలికిరి-తుమ్మలగుంట మధ్య మిగిలిన పనులు కూడా మరో మూడు నెలల్లోగా పూర్తి కానున్నాయని చెప్పారు. ఆ తరువాత విద్యుత్ రైళ్ళను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పీలేరులో నాగర్ కోయిల్- ముంబాయి, కాచిగూడ-మదురై రైళ్ల స్టార్టింగ్ కు అనుమతించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన స్పందిస్తూ ఆ విషయాన్ని రైల్వే బోర్డుకు ప్రతిపాదించడం జరిగిందన్నారు. దాంతో పాటు మరో రెగ్యులర్ రైలును కూడా నడవడానికి ప్రతిపాదించామని పేర్కొన్నారు. అనుమతులు వచ్చాక ఆ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ బృందం ముందుగా పీలేరు-చిత్తూరు, పీలేరు-మదనపల్లి మార్గాల్లోని రైల్వే గేట్ల వద్ద, పీలేరు గార్గేయ నది వంతెనపై జరిగిన విద్యుదీకరణ పనులను పరిశీలించింది. ఈ తనిఖీల్లో బెంగళూరు రైల్వే సేఫ్టీ కమిషనర్ అభయ్ కుమార్ రాయ్, ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరు సోమేష్ కుమార్, సిపిపి నాగేంద్ర ప్రసాద్, డిప్యూటీ సిఈ వీరయ్య, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com