ఉపాధి హామీకి సంబంధించి అధికారులకు, సిబ్బందికి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో మంగళవారం ఉపాధి హామీ సిబ్బందికి సమావేశం నిర్వహించారు. కూలీలకు పనిది నాలు పెంచాలని, వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మొక్కల పెంపకం, నీటి కుంటలు, చెక్ డ్యామ్ వంటి వాటిల్లో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. అనంతరం ఏపీడీ ఆదినారాయణమ్మ సిబ్బందికి పలు సూచనలిచ్చారు.