దంపతుల పై దుండగులు దాడి చేయడంతో భర్త కు తీవ్ర గాయాలు అయ్యాయి, మహిళ స్వల్పంగా గాయపడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన దంపతులు 10 గంటల సమయంలో వ్యక్తిగత పనుల నిమిత్తం ఎడ్లపాడు పోయి తిరిగి వస్తుండగా ఫిరంగిపురం సమీపంలోని పెద్ద కాలువ దగ్గరికి వచ్చేసరికి అకస్మాత్తుగా రోడ్డు మీదకు వచ్చిన దుండగులు వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కింద పడేసి మహిళను కొంతమంది నిర్బంధించగా మరికొంతమంది ఆమె భర్తను తీవ్రంగా గాయపరిచారు.
దీంతో ఆమె పెద్దగా కేకలు వేయడంతో అటుగా వెళుతున్న కొంతమంది ఇది గమనించి వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా దుండగలు సమీపంలోని పొలాల్లోకి పారిపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వారు ఎవరో తనకు తెలియదని అకస్మాత్తుగా రోడ్డుకు అడ్డంగా వచ్చి వాహనాన్ని ఆపి నా భర్తను తీవ్రంగా కొట్టారని అని నానా బూతులు తిట్టారు అని ఆమె వాపోయింది. ఏడు మంది దుండగులు ఉన్నట్లు ఆయన తెలిపారు.